హైదరాబాద్, జూన్ 6 : వెండితెరపై అందమైన ప్రేమ కథతో మాయ చేసి.. మోస్ట్ క్యూటెస్ట్ స్టార్ కపుల్ గా పేరు తెచ్చుకున్న చైతు-సమంతల మాయాజాలం "ఏం మాయ చేశావే". గౌతం మీనన్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం ప్లస్ అయింది. 2010లో వచ్చిన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. భారీవసూళ్లను సాధిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటు చైతూకు.. అటు సమంతకు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి దర్శకుడు గౌతమ్ మీనన్ సిద్దమవుతున్నాడని సమాచారం. ఇదే సినిమాను తమిళంలో శింబు.. త్రిష జంటగా చేశాడు. తమిళ సీక్వెల్ కి శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. మరి తెలుగు సీక్వెల్ కి చైతూ ఓకే చెప్పాల్సి ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కథానాయికల విషయంలోను స్పష్టత రావలసి వుంది. ఇదే కనక జరిగితే ఆ సినిమాను అమితంగా ప్రేమించే అభిమానులకు అంత కంటే కావలసింది ఏముంది.