బాలీవుడ్ నటి భర్తపై మనీలాండరింగ్ కేసు..!!

SMTV Desk 2018-06-06 13:56:08  money landering, mumbai, shilpa shetty, raj kundra,

ముంబై, జూన్ 6 : ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్తపై ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు పెట్టారు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన రాజ్‌కుంద్రా దంపతులు మనీలాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలతో ఈడీ అధికారులు దర్యాప్తు జరిపారు. పూణేకు చెందిన అమిత్ భరద్వాజ్ అనే వ్యక్తి పెట్టుబడుల పేరిట 8వేల మందిని మోసగించాడని బిట్ కాయిన్ కంపెనీపై కేసు నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బిట్ కాయిన్ కేసులో నిందితుడైన అమిత్ భరద్వాజ్ ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో బిట్ కాయిన్ లావాదేవీల్లో రాజ్‌కుంద్రా పేరుందని అమిత్ భరద్వాజతో ఆయన పలు లావాదేవీలు చేశాడని ఈడీ అధికారుల విచారణలో తేలింది. దీంతో ఈడీ అధికారులు రాజ్‌కుంద్రాను దాదాపు 10 గంటల పాటు విచారణ చేసినట్లు తెలుస్తోంది.