ఢిల్లీ, జూన్ 5 : అఫ్గానిస్తాన్తో జరిగే ఏకైక చారిత్రాత్మక టెస్టుకు ఇషాంత్ శర్మ ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఐపీఎల్లో కుడి చేతి వేలికి గాయం కావడంతో వికెట్ కీపర్ సాహా ఈ టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో మేనేజ్ మేంట్ దినేశ్ కార్తీక్ను తీసుకుంది. ఇప్పుడు ఇషాంత్ శర్మపై ఆడడంపై సందిగ్థత నెలకొంది. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో భారత ఆటగాడు ఇషాంత్ శర్మను ఎవరూ కొనుక్కోకపోవడంతో కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లాడు. ససెక్స్ జట్టు తరఫున ఆడిన ఇషాంత్ ఇప్పుడు గాయాల బారిన పడ్డాడు. తాజాగా అతడు గాయం కారణంగా ససెక్స్తో మ్యాచ్కు దూరమయ్యాడు. ఇలా జరగడం ఇది రెండోసారి. భుజం గాయం కారణంగా ఇంతకు ముందు మిడిలెక్స్తో మ్యాచ్కు ఇషాంత్ దూరం కావాల్సి వచ్చింది. నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఇషాంత్ 15 వికెట్లను దక్కించుకున్నాడు. రాయల్ లండన్ తరఫున వన్డే కప్లో 6 మ్యాచ్లాడిన అతడు 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. జూన్ 14న భారత్-అఫ్గానిస్థాన్ మధ్య బెంగళూరులో ఏకైక టెస్టు జరగనుంది.