అలనాటి జ్ఞాపకాలతో.. అరుదైన చిత్రం...

SMTV Desk 2018-06-04 19:03:35  rana diggubaati, 1950 s pic share, social media, adavi shesh.

హైదరాబాద్, జూన్ 4 : చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆనాటి నటులు, నటీమణుల౦తా కలిసి ఒకే ఫ్రేమ్ లో ఉంటే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది కదూ. అందరి హృదయాలో ఒక సుస్తిర స్థానాన్ని సంపాదించుకున్న అగ్ర తారలంతా కలిసి ఉన్న అరుదైన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫోటోలో హేమాహేమీయులంతా ఉన్నారు. ఈ ఫోటోను ప్రముఖ హీరో రానా దగ్గుబాటి.. తన స్నేహితుడు, నటుడు అడవి శేష్ కు షేర్‌ చేశారు. స్వయంగా ఈ విషయాన్ని అడవి శేష్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ.. రానాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్‌, అక్కినేని, ఎస్వీఆర్‌, శివాజీ గణేశన్‌, సావిత్రి, జెమిని గణేశన్‌, జయ లలిత, విజయ లలిత, బాలకృష్ణ (అంజి), కాంచన, బిఎన్‌‌రెడ్డి, నంబియార్‌, పేకేటి శివరామ్‌ తదితరులు ఉన్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ గా మారుతోంది. థ్యా౦కు రానా ఇంత చక్కటి ఫోటో షేర్ చేసినందుకు అంటూ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.