పెళ్లి చేసుకుందామని వెళ్ళిన ప్రేమ జంటకు చేదు అనుభవం

SMTV Desk 2017-07-11 10:49:49  Love couple, ghatkesar, bhadrachalam, enjineer student, police

యదాద్రి, జూలై 11 : ఇటీవల ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకుందామని భద్రాచలం వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లిన తరువాత యువకుడి ఆచూకీ లేకపోవడంతో యువతి మాత్రమే తిరిగి ఇంటికి వచ్చింది. మేడ్చల్ జిల్లా వలిగొండ మండలానికి చెందిన గణేష్ ఘట్కేసర్ మండలం వీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. అదే కళాశాలకు చెందిన విద్యార్ధినితో గణేష్ ప్రేమలో పడ్డాడు. ఈ నెల 6న పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుని భద్రాచలం వెళ్లారు. పెళ్లి ఖర్చుల కోసం డబ్బు ఒకరు తెస్తారని మరొకరు అనుకుని ఇద్దరు డబ్బు లేకుండా వచ్చినందుకు వాగ్వాదానికి దిగినట్లు గణేష్ స్నేహితుల ద్వారా తెలుస్తుంది. అయితే యువతి తన వద్దగల బంగారు ఆభరణం తీసి ఆ యువకుడికి డబ్బులు తీసుకురమ్మని ఇచ్చినట్లు సమాచారం. అక్కడి నుంచి బంగారు ఆభరణంతో వెళ్లిన గణేష్ తిరిగి రాకపోవడంతో యువతికి దిక్కు తోచని పరిస్థితి ఎదురవ్వడంతో తిరుగు హైదరాబాద్ వెళ్లింది. దీంతో గణేష్ తిరిగి రాకపోవడంతో అతని తండ్రి ఆగమయ్య ఆందోళన వ్యక్తం చేస్తూ ఘట్కేసర్ రక్షకభటశాఖ నిలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.