తిరుపతి, జూలై 10 : తిరుమలలో రెండవ ఘాట్ రోడ్డులో కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ ఏపీ 21 ఏసీ 0217. శ్రీవారికి మొక్కులు చెల్లించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.