బెంగళూరు, మే 29 : దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్, మిస్టర్ 360 డివిలియర్స్ గతవారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఐపీఎల్లో కొనసాగుతాడని, కొన్నేళ్ల పాటు అతడి మెరుపులు చూడొచ్చని అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఏబీ ఐపీఎల్లోనూ కొనసాగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రిటైర్మైంట్ ప్రకటించినపుడు ఏబీ.. "విదేశాల్లో ఆడే ఆలోచన లేదు. దేశీయ క్రికెట్లో టైటాన్స్ తరపున ఆడాలనుకుంటున్నా"అని తెలిపాడు. అంతే కాకుండా తాజాగా ట్విట్టర్లో అధికారిక రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఖాతాను అనుసరించడం ఆపేశాడు. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్లో మిస్టర్ 360 విన్యాసాలు చూడడం అనుమానంగానే మారింది. అయితే ఏబీ ట్విటర్లో ఇప్పటికీ ఐపీఎల్ అధికారిక ఖాతాను, విరాట్ కోహ్లిని అనుసరిస్తున్నాడు. నిజంగా ఏబీ ఐపీఎల్లో కూడా ఆడలేకపోతే మాత్రం అది అతడి అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించే విషయమే అనడంలో ఎటువంటి సందేహం లేదు.