హైదరాబాద్, మే 27 : "ప్రేమకథా చిత్రమ్" తో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు హీరో సుధీర్ బాబు. మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఒక ప్రత్యకమైన గుర్తింపును సాధించుకున్నారు. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు నిర్మాతగా మారారు. "ఎస్బీ" పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ లోగోను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. వీడియోను ప్రముఖ నిర్మాత దిల్రాజు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా.. "నిర్మాతగా మారే సాహసం చేశాడు. సుధీర్ చాలా ధైర్యవంతుడు. అతనికి విజయం వరించాలని కోరుకుంటున్నా" అంటూ అల్లు అరవింద్ అన్నారు. "నిర్మాతగా కూడా అదే అభిరుచిని కొనసాగిస్తారని ఆశిస్తున్నా" అంటూ దిల్రాజు పేర్కొన్నారు. అనంతరం సుధీర్బాబు మాట్లాడుతూ.. "ఇప్పటి వరకూ నేను నటించిన ఏడు సినిమాలలో ప్రతిభ ఉన్న దర్శకులు కథలు చెప్పారు. మనమే ఎందుకు ఇలాంటి కథల్ని తీయకూడదు అనిపించి నిర్మాతగా మారాను. ప్రస్తుతం నేను హీరోగా ఈ సంస్థలో తొలి సినిమా తెరకెక్కుతోంది. నేనే కథానాయకుడిగా కాకుండా కొత్తవారితోనూ సినిమాలు చేస్తాను" అని చెప్పుకొచ్చారు.
Here it is Video Logo of #SudheerBabuProductions
— Sudheer Babu Productions (@SBPoffl_) May 27, 2018
Please follow us on:
Twitter: https://t.co/389Tyk9Fs0
Instagram: https://t.co/4dq65EatG7
Facebook: https://t.co/18KzflJRtN@isudheerbabu pic.twitter.com/j0dSN3d0Ii