టీడీపీపై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు..

SMTV Desk 2018-05-25 17:08:54  Motkupalli Narasimhulu, tdp leader Motkupalli Narasimhulu, hyderabad, tdp, chandrababunaidu

హైదరాబాద్, మే 25 : టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేశానని.. చంద్రబాబును నమ్మి సర్వం కోల్పోయాను అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిని కాబట్టే తనని అవమాన పరుస్తున్నారని.. కొత్తగా వచ్చిన నాయకులను ఆకాశానికి ఎత్తుతున్నారని ఆరోపించారు. ఈ రోజు మోత్కుపల్లి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.."నన్ను పార్టీ నుండి బయటకు గెంటేసే కుట్ర జరుగుతుంది. 30 ఏళ్లుగా పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తున్నాను. కానీ కనీసం 5 నిమిషాలు మాట్లాడేందుకు చంద్రబాబు సమయం ఇవ్వలేదు. కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా అవమాన పరిచారు. రేవంత్‌రెడ్డికి అడ్డంగా మాట్లాడినందుకే నన్ను అలా చేస్తున్నారు. నేను చేసిన తప్పు చెప్పే వరకు ఇలానే మాట్లాడుతూనే ఉంటా. పార్టీ కోసం నిజాయితీగా పని చేయడమే తప్పా? చంద్రబాబు కోసం దెబ్బలు తిన్నాను. ఆయనను నమ్మాను. నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను. రేవంత్‌రెడ్డి కూతురు పెళ్లిని చంద్రబాబు దగ్గరుండి చేయించారు. కానీ నా బిడ్డ పెల్లికి ఎప్పుడో నాలుగు గంటలకు వచ్చారు" అని తన ఆవేదనను వెళ్లగక్కారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని... చంద్రబాబు ఎందుకు చేయడం లేదని మోత్కుపల్లి విమర్శించారు. కేసీఆర్ డబ్బులు లేని వాళ్లకు రాజ్యసభకు పంపారు. తెలంగాణలో చంద్రబాబు మాటకు విలువ ఎక్కుడుంది? అని ప్రశ్నించారు. ఆరు నెలలకు ఒక్కసారి వస్తే ఇక్కడ కార్యకర్తల పరిస్థితి ఏంటి? రేవంత్‌రెడ్డిని చంద్రబాబు నమ్మారు.. ఏమైంది? ఓ పనికిమాలిన వ్యక్తిని నమ్మి పార్టీని నాశనం చేశారు. తెలంగాణలో టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందని మోత్కుపల్లి అన్నారు.