నేడు నగరానికి చంద్రబాబు..

SMTV Desk 2018-05-24 13:11:09  ap cm, chandrababu naidu, hyderabad, mahanadi program, nampally exibition.

అమరావతి, మే 24 : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఈ మధ్యాహ్నం 12.30గంటలకు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గన్నవరంలోని విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి 1.40గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గం గుండా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. ఆ గ్రౌండ్ లో జరిగే తెలంగాణ టీడీపీ “మహానాడు”లో పాల్గొంటారు. ఆ మహానాడు సభలో సుమారు 5 గంటల పాటు పాల్గొని అక్కడి నుండి హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకుంటారు. మరుసటి రోజు మే 25వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకు౦టారు. అక్కడి నుంచి గన్నవరం చేరుకుని హెలికాప్టర్ ద్వారా ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.