అంగట్లో అమ్మతనం

SMTV Desk 2017-07-10 12:05:50  mother, baby, khamamam, mahabubh dist, Baby sale, childcare, police

ఖమ్మ, జూలై 10 : బిడ్డపై తల్లికుండే మమకారమే వేరు. ఎంత దీన స్థితిలో ఉన్నా, బిడ్డకి ఆకలి వేస్తే ఆమె పస్తులుండైన తన బిడ్డ కడుపు నింపుతుంది. ఇలాంటి తల్లులా మధ్య ఓ దుర్మార్గ, స్వార్ధపు తల్లి తన పొట్ట నింపుకునేందుకు పిల్లలను కంటోంది. అంతటితో ఆగకుండా పిల్లలతో అన్యాయంగా బిక్షాటన చేయిస్తుంది. బేరం కుదిరితే అమ్మేసేందుకు గర్భం దాల్చుతుంది. ఇలా చేసుకుంటూ ఏకంగా ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. నేడు ఆ పిల్లలతోనే బిక్షాటన చేయిస్తూ వచ్చిన డబ్బుతో బతికేస్తోంది. ఈ దుర్మార్గపు ఘటన ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సంచలనం రేపింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన తామలా సమ్మక్కకు ఖమ్మంలోని రంగనాయకుల గుట్ట ప్రాంతానికి చెందిన భగవాన్ కు పదేండ్ల క్రితం వివాహం జరిగింది. భగవాన్ రిక్షా నడుపుతూ, సమ్మక్క బిక్షాటన చేస్తూ ఈ ఇద్దరు జీవనం సాగిస్తుండేవారు. ఇప్పటికే ఈమెకు నలుగురు కుమారైలు, ఒక కుమారుడు ఉండగా శనివారం ఖమ్మం దవాఖనలో ఓ ఆడశిశువు జన్మనిచ్చింది. అక్కడే పనిచేసే స్వీపర్ జ్యోతికి తన బిడ్డను విక్రయిస్తానని చెప్పడంతో, ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేతకొండకు చెందిన రాచర్ల వెంకటరమణ, ఆమె అత్త భారతమ్మ ఆదివారం ఉదయం ఆసుపత్రికి వచ్చి, సమ్మక్కకు రూ. 5,500 ముట్టజెప్పి పసికందును తీసుకెళ్లారు. అయితే ఈ విషయాన్ని గమనించిన ఆసుపత్రిలో ఉన్న కొందరు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పోలీసులు శిశువుని తీసుకుని చైల్డ్ కేర్ సెంటర్ లో అప్పగించారు. ఈ బిడ్డ విక్రయంలో పాలుపంచుకున్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.