రజినీ సరసన తొలిసారి..

SMTV Desk 2018-05-23 16:01:18  rajinikanth, simran, karthik subbaraj, anirudh ravichandar.

హైదరాబాద్, మే 23 : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. కార్తీక్ సుబ్బరాజ్‌ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే తలైవాకు జోడీగా త్రిష, ప్రముఖ సీనియర్ నటి మీనా నటిస్తారని వార్తలు వచ్చాయి. కాని రజినీకి జోడీగా ప్రముఖ కథానాయిక సిమ్రాన్ నటించనున్నట్లు కోలీవుడ్ సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సిమ్రాన్ రజినీ సరసన చేయడం ఇదే తొలిసారి. అలాగే ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం సిమ్రాన్ తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. రజనీ నటించిన "కాలా" చిత్రం జూన్‌7న విడుదలకు సిద్ధమైంది. మరోపక్క శంకర్‌ దర్శకత్వం వహించిన "2.ఓ" చిత్రం విడుదల విషయంలో క్లారిటీ లేదు.