తండ్రి జ్ఞాపకాల్లో నాగార్జున..

SMTV Desk 2018-05-23 13:34:25  akkineni nagarjuna, manam movie, anr, nagarjuna twitter.

హైదరాబాద్, మే 23 : అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన చివరి సినిమా "మనం". ఈ చిత్రం చివరి దశలో ఉండగానే ఆయన మరణించారు. అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించిన ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్ర౦ 2014 లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రంలో సమ౦త, శ్రియ శరణ్ హీరోయిన్ లుగా నటించారు. నేటితో ఈ సినిమా 4 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగార్జున తన తండ్రి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో.. "మీరు మాకు నవ్వడం నేర్పించారు.. బాధను ఎదుర్కోవడం నేర్పించారు.. జీవితాన్ని.. మరణాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. మాలో ఇంతటి స్ఫూర్తిని నింపిన మీ గురించే మేమంతా ఆలోచిస్తూ ఉంటాము" అంటూ ట్వీట్ చేశారు.