నిజామాబాద్, జూలై 10 : అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.... శ్రీకాంత్ అనే బాలుడు రెండు రోజుల క్రితం కిడ్నాప్ కు గురయ్యాడు. సోమవారం ఉదయం ఆ బాలున్ని చంపి మృతదేహాన్ని గ్రామంలో పడవేసి, పారిపోతున్న దుండగుల వాహనాన్ని గ్రామస్తులు పట్టుకునే లోపే, వారు పారిపోయారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.