ప్రేయసిని చంపిన ప్రేమికుడు

SMTV Desk 2017-07-09 12:07:05  vishakhapatnam, Boyfriend, kills, girlfriend

విశాఖ‌ప‌ట్నం, జూలై 9 : ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేయడం మనం చూస్తున్నాం. కాని ప్రేమించిన అమ్మాయిని ఇంటికి పిలిపించుకొని మరి అతి దారుణంగా చంపిన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. సతీష్‌కుమార్‌ అనే యువకుడితో భవాని అనే యువతికి మూడేళ్లుగా పరిచయం ఉందని, ఇద్దరు ఒకరింటికి మరొకరు వెళ్తూ ఉంటారు. అయితే మాట్లాడేందుకు తన ప్రియురాలిని ఇంటికి పిలిపించుకున్న ఆ యువకుడు రెండు గంటల తర్వాత ఇంట్లోని కబ్‌ బోర్డు అద్దం బద్దలుగొట్టి అద్దం ముక్కతో తన ప్రియురాలి గొంతు కోశాడు. కోపోద్రిక్తుడైన ఆ యువకుడు ఆమె తలపై దంబెల్ తో కొట్టి ఆమె జుట్టు పట్టుకొని మెట్లపై నుంచి ఈడ్చుకుంటూ బయటకు వచ్చాడు. ఆ యువతి అరుపులు విన్న స్థానికులు ఆ యువ‌కుడిని ఆపడానికి ప్రయత్నించారు. తన దగ్గరకువస్తే వారిని కూడా చంపేస్తానని బెదిరించడంతో అతనిని ఆపడం ఎవరి తరం కాలేదు. చివరికి ఆ యువకుడికి దేహశుద్ది చేసిన స్థానికులు గాయాల పాలైన నిందితుడిని ఆసుప‌త్రికి త‌ర‌లించి, స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.