హైదరాబాద్, జూలై 8 : నగరంలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పాత కక్షలతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం, గుర్తు తెలియని వ్యక్తులు నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.7 లో నడి రోడ్డుపై ఒక వ్యక్తిని పొడిచి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీస్ ఇన్ఫార్మర్ అయిన చారీని నిందితులు పాత కక్షతో చంపి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి, స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను పరిశీలించనున్నారు.