బెంగళూరు, మే 15 : కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య బాదామి నియోజకవర్గం నుండి విజయం సాధించారు. మరోవైపు ఆయన పోటీచేసిన చాముండేశ్వరి నియోజకవర్గంలోనూ పరాభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిద్దరామయ్య బాదామి, చాముండేశ్వరి నియోజకవర్గాల్లో పోటీ చేశారు. బాదామి నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి శ్రీరాములుపై ఆయన 3వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. బాదామి నియోజకవర్గంలో సీఎం సిద్దరామయ్యపై బీజేపీ అభ్యర్థి శ్రీరాములు మొదట ఆధిక్యం కనబచ్చారు. ఈ నియోజకవర్గంలో శ్రీరాములు, సిద్దరామయ్య మధ్య హోరాహోరి నెలకొంది. మరో నియోజకవర్గం చాముండేశ్వరిలో సిద్దరామయ్య ఓటమి పాలయ్యారు. ఇక్కడ ఆయనపై జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ మొదటిరౌండు నుంచి ఆధిక్యం కనబర్చారు. మొత్తానికి 25,861 ఓట్ల మెజారిటీతో సిద్దరామయ్యపై ఆయన గెలుపొందారు. కన్నడ రణం ఫలితాలు.. * హెచ్.డీ.కుమారస్వామి (జేడీఎస్) రామ్ నగర, చెన్నపట్టణం గెలుపు * షికారిపురలో యడ్యూరప్ప(బీజేపీ) విజయం * మొళకాల్మూర్లో శ్రీరాములు (బీజేపీ) విజయం * బాగేపల్లిలో సినీ నటుడు సాయికుమార్ (బీజేపీ) పరాజయం * శివాజీ నగర్లో రోషన్ బేగ్ (కాంగ్రెస్) గెలుపు * శివమొగ్గలో ఈశ్వరప్ప (భాజపా)విజయం