ఆ రెండు చోట్ల రీపోలింగ్‌..!

SMTV Desk 2018-05-14 13:21:52  karnataka elections, repolling, karnataka election, hebballa

బెంగళూరు, మే 14 : కర్ణాటకలో ఈ నెల 12న 222 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 58,000 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికలు జరిగిన రోజు ఈవీఎంలో సాంకేతిక లోపాల కారణంగా హెబ్బాళలోని లొట్టగొల్లహళ్లి, కొప్పళ్లలోని కుష్టగిలో రీపోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్‌ సాయంత్రం 6గంటల వరకూ కొనసాగనుంది. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు గానూ 222 స్థానాలకు గత శనివారం ఎన్నికలు జరిగాయి. జయనగర భాజపా అభ్యర్థి విజయకుమార్‌ హఠాన్మరణం చెందటంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. రాజరాజేశ్వరి నగర్‌లో నకిలీ ఓటు కార్డుల వివాదం కారణంగా పోలింగ్‌ వాయిదా పడింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈనెల 28న పోలింగ్ జరగనుంది.