సెహ్వాగ్ సరసన రాజస్థాన్ ఆటగాడు..

SMTV Desk 2018-05-14 12:41:56  jos buttler, buttler sehwag record, ipl, rajastan royals

ముంబై, మే 14 ‌: ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. ఒక సీజన్ లో వరుసుగా ఐదు శతకాలు సాధించి వీరు సరసన నిలిచాడు. 2012లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఆడిన సెహ్వాగ్‌ ఆ సీజన్‌లో వరుసగా ఐదు అర్ధశతకాలు నమోదు చేశాడు.మళ్లీ ఇన్నాళ్లకు బట్లర్‌ ఒకే ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా 5 అర్ధశతకాలు నమోదు చేసి సెహ్వాగ్‌ నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. టోర్నీలో భాగంగా ఆదివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్‌ 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. అంతకుముందు దిల్లీ డేర్‌డెవిల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఒకసారి, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాజ్‌పై రెండుసార్లు అర్ధశతకాలు సాధించాడు. ఇప్పటి వరకు టీ20 క్రికెట్‌లో కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఇలా వరుసగా ఐదు అర్ధశతకాలు నమోదు చేశారు. వీరేంద్ర సెహ్వాగ్‌, బట్లర్‌, హామిల్టన్‌ మసకడ్జా, కమ్రాన్‌ అక్మల్‌ ఈ జాబితాలో ఉన్నారు.