సిమ్లా, మే 13: హిమాచల్ ప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. సిర్మార్ జిల్లా సనోరా వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా.. మరో 12మంది క్షతగాత్రులయ్యారు.ఈ ఘటనలో తీవ్రంగా గాయ పడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సిర్మోర్ డిప్యూటీ కమిషనర్ లలిత్ జైన్ మాట్లాడుతూ... "మృతి చెందిన వారిలో చాలా మంది రాజ్గఢ్ ప్రాంతానికి చెందిన వారే. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నాం. దీనిపై వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం. క్షతగాత్రులను సర్మోర్ ఆసుపత్రిలో చేర్చాం" అని తెలిపారు.