కీపర్లు... ఆదరగోడుతున్నారు

SMTV Desk 2018-05-12 20:37:21  ipl keepers, ipl-11, ms dhoni, rishabh pant

హైదరాబాద్, మే 13 : ఐపీఎల్-11 సీజన్ లో ఆయా జట్టు కీపర్లు బ్యాటింగ్ తో ఆదరగోడుతున్నారు. సీజన్ ఆరంభం నుండి ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు కీపర్ వృద్ధిమాన్‌ సాహా మినహా మిగతా కీపర్లు తమ తమ జట్టు విజయాల్లో కింగ్‌మేకర్లుగా ప్రధాన భూమికను పోషిస్తున్నారు. ఇక ఈ జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోని, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌, కింగ్స్‌ పంజాబ్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, ముంబై ఇండియన్స్‌ యువ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషాన్‌లు పరుగుల వరద పారిస్తున్నారు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు వారు సాధించిన పరుగులు.. * రిషభ్‌ పంత్‌ 582 పరుగులు * లోకేశ్‌ రాహుల్‌ 537 పరుగులు * జోస్‌ బట్లర్‌ 415 పరుగులు * మహేంద్ర సింగ్‌ ధోని 393 పరుగులు * దినేశ్‌ కార్తీక్‌ 371 పరుగులు * ఇషాన్‌ కిషాన్‌ 238 పరుగులు