సరైన వ్యక్తిని ఎన్నుకోండి.. : అనుష్క

SMTV Desk 2018-05-12 16:51:33  anushka, facebook post, karnataka elections,

హైదరాబాద్, మే 12 : కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ అనుష్క.. అభిమానులకు సందేశం ఇచ్చారు. స్వతహాగ కర్ణాటకలో పుట్టిన అనుష్క.. సరైన వ్యక్తికి ఓటు వేసి మంచి నాయకుణ్ణి ఎంచుకోవడం మన బాధ్యతని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ మేరకు అనుష్క తన ఫేస్‌బుక్‌లో.. "మీ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కర్ణాటక ప్రజలను కోరుతున్నా. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కును పొందడం మాత్రమే కాదు.. సరైన వ్యక్తికి ఓటు వేయడం కూడా. అందుకని ఆలోచించి, ఓటు వేయండి. ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. కాగా అనుష్క ప్రధాన పాత్రలో జి.అశోక్‌ దర్శకత్వం వహించిన "భాగమతి" చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లను రాబట్టి౦ది.