హైదరాబాద్, మే 10: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ ఆర్టీసీలోని ఏడు కార్మిక సంఘాలు గురువారం సంస్ధ ఎండీ రమణారావుకు సమ్మె నోటీసులు ఇచ్చాయి. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈనెల 24 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని కార్మికసంఘాలు నోటీసులో పేర్కొన్నాయి. 2017 నుంచి అమలు కావాల్సిన వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని, కనీస వెతనాన్ని 24వేలకు పెంచాలని, ఇంక్రిమెంట్ రేటు ప్రతీ స్లాబ్లో బేసిక్పై ఆరుశాతం ఉండాలని, కార్మిక సంఘం నేతలు సమ్మె నోటీసులో పేర్కొన్నారు.