ఇది ఆరంభం మాత్రమే: మందకృష్ణ

SMTV Desk 2017-07-08 10:31:22  mankrishna, madiga, chandrababu naidu

గుంటూరు, జూలై 8 : గత రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే పోలీసుల అదుపులో ఉండి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వెంకట రాములును పరామర్శించేందుకు మందకృష్ణ మాదిగ రాత్రి 10.30 సమయంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. అదే సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ఆయనను వాహనంలో తీసుకెళ్లి, ఏపీ సరిహద్దులు దాటించి వదిలేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ... నేను అభిమానించే నేతల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ‘‘టీడీపీకి పూర్తి మద్దతు ప్రకటించి, ఏపీలో ఓట్లు వేసి గెలిపించాం. వర్గీకరణకు మద్దతుగా నిలిచిన ఆయన ఇలా చేస్తారని ఊహించలేదు. కురుక్షేత్ర సభ ఆరంభం మాత్రమే, త్వరలో మా తడాఖా ఏమిటో చూపిస్తాం’’ అని హెచ్చరించారు.