రాయలసీమ నేపథ్యంలో మహేష్ సినిమా..!!!

SMTV Desk 2018-05-09 18:26:10  MAHESH BABU, 25 FILM, POOJA HEGDE, VAMSHI PAIDIPALLI.

హైదరాబాద్, మే 9 : ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన "భరత్ అనే నేను" చిత్రం ఘన విజయం సాధించి రికార్డు దిశగా దూసుకుపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ తన 25 వ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పనుల్లో వంశీ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే... అమెరికాలో లొకేషన్లను వెతికే పనిలో వంశీ బిజీగా ఉన్నట్లు వంశీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీంతో అమెరికా నేపథ్యంలోనే ఈ సినిమా సాగనుందని అంతా అనుకున్నారు. కాని అంచనాలను తలకిందులు చేస్తూ.. ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో రూపొందనుందనేది ప్రస్తుత సమాచారం. మహేష్ ఇలాంటి నేపథ్యంలో అసలు ఇంతవరకు సినిమా చేయలేదని టాక్ వినిపిస్తోంది. గ్రామీణ౦గా తెరకెక్కించబోతున్న సినిమా ఎలా ఉంటుందో అని అభిమానుల్లో ఆత్రుత నెలకొంది. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది.