కుంభకోణం విచారణ పై సమాధానం చెప్పాలి: పొన్నాల

SMTV Desk 2018-05-09 16:28:30  ponnala lakshmaiah Kc r Miyapur land scam case

హైదరాబాద్, మే 9‌: టీఆర్‌ఎస్‌ హయాంలో వెలుగులోకి వచ్చిన నయీం కేసు, మియాపూర్‌ భూముల కుంభకోణంపై విచారణ ఎంతవరకు వచ్చిందో సమాధానం చెప్పాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు తీయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్న వార్తలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు ఆయన ఘాటుగా స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కేసీఆర్‌కు కాంగ్రెస్‌ అంటే భయం పట్టుకుందన్నారు. తనకు ఏ కుంభకోణంతోనైనా సంబంధం ఉందని నిరూపిస్తే అసెంబ్లీ ముందే ఉరేసుకుంటానని చెప్పారు.