హైదరాబాద్, మే 9 : సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం "మహానటి". కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సైతం ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఈ చిత్రం చూసిన దర్శకధీరుడు రాజమౌళి.. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "మహానటి సావిత్రి పాత్రను వెండితెరపై కీర్తి సురేష్ అత్యద్భుతంగా పోషించింది. నేను చూసిన గొప్ప నటుల్లో కీర్తి సురేష్ ఒకరు. లెజెండరీ నటి సావిత్రిని సజీవంగా మన ముందు నిలబెట్టింది. దుల్కర్ సల్మాన్ నటన ఆమోఘం. ఇప్పటి నుంచి నేను ఆయన అభిమానిగా మారిపోయా. స్వప్న, నాగ్ అశ్విన్కు అభినందనలు. మీ నమ్మకం, సినిమా పట్ల మీకున్న అంకిత భావం నిజంగా అద్బుతం" అంటూ ట్వీట్ చేశారు.