హైదరాబాద్, మే 9 : తెలుగు ప్రజామానికం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. అలనాటి తార సావిత్రి బయోపిక్ "మహానటి" చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. మహానటి సావిత్రి జ్ఞాపకాలతో కూడిన పలు ఫొటోలతో రూపొందించిన ఆ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. ఎందరో నటీమణులున్నారు. కానీ ఒక్కరే మహానటి. నాకు దక్కిన అదృష్టం ఏంటంటే.. నా కెరీర్ కు పునాది వేసిన "పునాది రాళ్లు" సినిమాలో ఆ మహానటి తో కలిసి నటించే అవకాశం లభించింది. కళ్ళతోనే హావభావాలను పలికించి కథంతా నడిపించగలిగే మహానటి ఒక్క సావిత్రి మాత్రమే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక నటిగా, వ్యక్తిగా, అమ్మగా, స్ఫూర్తి ప్రదాతగా ఆ సావిత్రమ్మ ఈ చిరంజీవి మనస్సులో ఎప్పటికీ చిరంజీవే. ఆ మహానటి జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా" అంటూ వెల్లడించారు.
Mega Star #Chiranjeevi garu about #Mahanati...Releasing tomorrow! pic.twitter.com/7Ay0NrXeOd
— జయహో మహానటి! (@UrsVamsiShekar) May 8, 2018