ముంబై, మే 7 : బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్.. ప్రస్తుతం "సంజు" సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. సీనియర్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ దత్ ను ఈ సినిమాలో అన్ని కోణాల్లో ఆవిష్కరించనున్నారు. దీనికి రణ్బీర్ చాలా కష్టపడ్డాడు. తాజాగా రణ్బీర్ కథానాయకుడిగా "షంషేరా" అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో రణ్బీర్ బందిపోటుగా కనిపించబోతున్నారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో యశ్రాజ్ ఫిల్మ్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి తొలి ప్రచార చిత్రాన్ని నిర్మాణ సంస్థ విడుదల చేసింది. నలుపు రంగు దుస్తుల్లో రణ్బీర్ కాస్త భయంకరంగా కనిపించారు.
करम से डकैत,
— Yash Raj Films (@yrf) May 7, 2018
धरम से आज़ाद
Presenting #RanbirKapoor in a never seen before avatar in YRF's next action adventure #SHAMSHERA. Directed by @karanmalhotra21 | @ShamsheraMovie pic.twitter.com/5Dqg7GDOhQ