ప్రియుడి మరణంతో.. ప్రేయసి ఆత్మహత్య

SMTV Desk 2017-07-07 15:58:47  boyfriend, died, of, illness, fell, in, love, with, his, girlfriend

తాడేపల్లిగూడెం, జూలై 7 : తల్లి రెండేళ్ల క్రితం జీవనోపాధి కోసం మస్కట్‌ వెళ్లింది. తండ్రి సత్తార్‌ మద్యానికి బానిసగా మారాడు. వివరాలలోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వీకర్స్‌ కాలనీలో ఉంటున్న షేక్‌ రజియా బేగం(16) ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె అన్నయ్య ముస్తఫా ఏలూరు సీఆర్‌ రెడ్డి కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. కొంతకాలంగా రజియా, కడకట్లకు చెందిన సురేష్‌ ప్రేమించుకుంటున్నారు. కాగా సురేష్‌ అనారోగ్యంతో బుధవారం మృతి చెందగా, ఆ మృతదేహాన్ని చూసినప్పటి నుండి రజియా ఏడుస్తూనే ఉంది. అన్నయ్య ముస్తఫా గురువారం ఉదయం కళాశాలకు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉంది. స్థానికుల సహకారంతో ఆమెను కిందకు దించి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.