ప్రశాంతంగా ముగిసిన నీట్‌

SMTV Desk 2018-05-06 13:36:51  neet exam, neet exam complete, cbse, hyderabad

హైదరాబాద్, మే 6 : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌) దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)కు దాదాపు 13,26,725 మంది పరీక్షకు హాజరవుతున్నారని సీబీఎస్‌ఈ తెలిపింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నిర్వహించారు. ఉదయం 7.30 నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. 9.30 తరువాత కేంద్రంలోనికి ప్రవేశం నిలిపివేశారు. నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని లోనికి అనుమతించలేదు.