హైదరాబాద్, మే 6 : జయం రవి కథానాయకుడిగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం "టిక్ టిక్ టిక్". నేమిచంద్ జబక్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈనెల 22 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకాధారణ పొందాయి. ముఖ్యంగా "కురుంబా.." అంటూ సాగే పాట ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. గతంలో జయంరవి, దర్శకుడు శక్తి సౌందరరాజన్ కాంబినేషన్లో జోంబీస్ నేపథ్యంలో వచ్చిన "మిరుదన్" మంచి విజయాన్ని సాధించింది. తాజాగా మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో అంతరిక్ష నేపథ్యంలో ఈ చిత్రం రావడం విశేషం.