ఆర్జీవి ని చూసి షాక్ తిన్నా.. ఎవరికి అర్థం కాని రకం

SMTV Desk 2018-05-06 12:18:25  puri jagannath, akash puri, mehabooba movie.

హైదరాబాద్, మే 6 : డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తన తనయుడు ఆకాష్ పూరితో తెరకెక్కించిన చిత్రం "మెహబూబా". ఈ చిత్రాన్ని మే 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుండే కాకుండా సినీ ప్రముఖుల నుండి కూడా మంచి ప్రశంసలే దక్కాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. మిమ్మల్ని ప్రభావితం చేసిందెవరు? అన్న ప్రశ్నకు స్ప౦దిస్తూ.. "శ్రీశ్రీ, చలం, రంగనాయకమ్మ, రజనీష్‌, మణిరత్నం, వర్మ, బాలచందర్‌.. వీళ్ల౦తా నాపై ప్రభావం చూపిన వ్యక్తులు. వీరి నుండి ఇప్పటికీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటా" అన్నారు. అంతేకాకుండా.. జీవితంలో ఎవరిమీదైనా ఈర్ష్య పడ్డారా.? ఇలా బ్రతికితే బాగుండు అనుకున్నారా.? అనే ప్రశ్నకు.. ఒక్కొకరికి ఒక్కో లైఫ్ ఉంటుంది. ఎవరి జీవితం వారిది. నాకు నాలా బ్రతికితేనే కిక్ ఉంటుంది. ఇప్పటివరకు ఎవరిపైనా ఈర్ష్య పడలేదు కాని.. ఆర్జీవీ ని చూసి మాత్రం షాక్ తిన్నా. ఎవరికి అర్థం కాని.. అర్థం చేసుకోలేని రకం" అంటూ చెప్పుకొచ్చారు.