కన్నడనాట ప్రభుత్వం మారుతుంది : మోదీ

SMTV Desk 2018-05-03 15:23:25  marendara modi, karnataka elections, bjp, congress

కలబురగి, మే 3 : కర్ణాటక ఎన్నికల దగ్గర పడతుండడంతో ముఖ్యమైన పార్టీలు ప్రచారాల జోరు పెరిగింది. బీజేపీ తరపున స్వయంగా బరిలోకి దిగిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని కలబురగిలో ఇవాళ ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు కాలం చెల్లిందని.. దేశంలో ఏ మూలలో కూడా కాంగ్రెస్‌ ఇక విజయం సాధించలేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఈ ఎన్నికల కర్ణాటక భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి. ఇది మహిళల భద్రత, రైతుల అభివృద్ధికి సంబంధించిన అంశమని, కేవలం ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం మాత్రమే కాదు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ ప్రభుత్వం మారాలి. ఈ సారి కర్ణాటకలో ప్రభుత్వం మారుతుంది. దేశంలో ఏ మూలలో కూడా కాంగ్రెస్‌ ఇక విజయం సాధించలేదు" అని మోదీ వ్యాఖ్యానించారు.