హైదరాబాద్, మే 3 : బాలీవుడ్ ముద్దుగుమ్మ.. అనుష్క శర్మ మే 1వ తేదీన తన 30వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మూగ జీవాల కోసం ప్రత్యేకంగా ఓ జంతు పరిరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో.. మనుషులుగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. మనకు మాట్లాడడానికి నోరుంది. మనకు కావలసింది అడగడానికి ప్రాథమిక హక్కులున్నాయి. కాని నోరులేని మూగ జీవాల పరిస్థితి ఏంటి.! ఒక్కసారి ఆలోచించండి. అవి ఎలా బతుకుతున్నాయో చూడండి. వాటిని సంరక్షించడం మన బాధ్యత అంటూ వెల్లడించారు. అంతేకాకుండా ఈ పుట్టిన రోజు సందర్భంగా తాను ఒక నిర్ణయం తీసుకున్నానని.. ముంబైలో నోరులేని మూగ జీవాల కోసం ఒక గృహాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపారు. అందులో వాటికి కావలసిన అన్ని సదుపాయాలను సమకూరుస్తానని.. ఇందుకోసం నాకు మీ సలహాలు, సూచనలు కావాలంటూ ట్వీట్ చేసింది.