దుబాయ్, మే 2 : టెస్టుల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకొన్న టీమిండియా క్రికెట్ జట్టుకు వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో నిరాశే ఎదురైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో... కోహ్లిసేన నెంబర్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఇంగ్లాండ్ జట్టు125 పాయింట్లతో టాప్ ర్యాంకు లోకి దూసుకుపోగా.. భారత్ 122 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక టీ-20ల్లో మన జట్టు 123 పాయింట్లతో మూడో ర్యాంకును దక్కించుకొంది. పొట్టి ఫార్మాట్ ర్యాంకుల్లో మాత్రం అంతగా మార్పుల్లేవు. టాప్-5 జట్లు అదే ర్యాంకులో కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ 130 పాయింట్లతో పట్టికలో టాప్ లో ఉంది. ఆస్ట్రేలియా (126), భారత్ (123), న్యూజిలాండ్ (116), ఇంగ్లండ్ (115), దక్షిణాఫ్రికా(114) టాప్ 5 స్థానాలు మళ్లీ నిలబెట్టుకున్నాయి. దిగ్గజాల రిటైర్మెంట్తో శ్రీలంక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ టాప్-10లో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.