లండన్, మే 2 : ప్రతిష్టాత్మక వింబుల్డన్ ప్రైజ్మనీ భారీగా పెరిగింది. గతేడాది పోలిస్తే 7.6 శాతం పెరుగుదలతో మొత్తం రూ. 309 కోట్లగా ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది. ఈ ఎడాది పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలు సుమారు రూ. 20.5 కోట్ల చెప్పున నజరానా అందుకోనున్నారు. కొందరు క్రీడాకారులు గాయాల కారణంగా తొలిరౌండ్ మధ్యలోనే వైదొలుగుతున్న నేపథ్యంలో ఫిఫ్టీ-ఫిఫ్టీ రూల్ను సరికొత్తగా ప్రవేశపెట్టారు. గాయపడిన ఏ ఆటగాడైనా మెయిన్ డ్రా ఆరంభానికి ముందే వైదొలిగితే తొలిరౌండ్ ప్రైజ్మనీ ద్వారా లభించే మొత్తంలో 50 శాతం అతడికి ఇవ్వనున్నారు. మిగతా 50శాతం మొత్తాన్ని అతడి స్థానంలో బరిలోకి దిగే ప్లేయర్కు దక్కుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇక కాలుష్య నివారణకు ప్లాస్టిక్ స్ట్రాలను కూడా నిషేధిస్తున్నట్టు వెల్లడించారు.