పీఏసీ చైర్మన్‌గా మరోసారి ఖర్గే

SMTV Desk 2018-05-02 10:35:38  pac chairman, Mallikarjun Kharge, congress, nda

న్యూఢిల్లీ, మే 2: పార్లమెంట్‌ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే మళ్లీ నియమితులయ్యారు. ఖర్గేని మరోసారి పీఏసీ చైర్మన్‌గా ఎంపిక చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. విపక్ష నేత పీఏసీకు సారథ్యం వహించడం ఆనవాయితీ. దీనిలో 22 మంది సభ్యులుండగా వీరిలో ఎక్కువ మంది అధికార ఎన్డీఏ పార్టీ నేతలే ఉన్నారు. ప్రభుత్వ ఖర్చులు పార్లమెంట్‌ కేటాయింపులకు అనుగుణంగా ఉన్నాయో లేదో ఈ కమిటీ పరిశీలిస్తుంది. అంచనాల కమిటీకి బీజేపీ నేత మురళీ మనోహర్‌ జోషీని, శాంతకుమార్‌ను పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీకి చైర్మన్‌గా నియమిస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తెలిపారు.