దుబాయ్, మే 1 : భారత్ జట్టు టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మంగళవారం ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో 125 రేటింగ్ పాయింట్లతో కోహ్లిసేన తొలి స్థానంలో నిలిచింది. 112 పాయింట్లతో దక్షిణాఫ్రికా జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య 13 పాయింట్ల వ్యత్యాసం ఉంది. భారత్ ను చేరుకోవాలంటే మిగతా జట్లు అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంది. 106 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో 102 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి.