అహ్మదాబాద్, మే 1 : భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఓ బ్రాహ్మణుడని గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది అన్నారు. బాగా చదువుకున్నవారిని బ్రాహ్మణులుగా సంబోధించవచ్చని తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. గాంధీనగర్లో ఆదివారం జరిగిన మెగా బ్రాహ్మిణ్ బిజినెస్ సమ్మిట్లో మాట్లాడుతూ.. "రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ముమ్మాటికీ బ్రాహ్మణుడేనని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించను. సర్వం తెలిసిన జ్ఞానిని బ్రాహ్మణుడు అనడంలో తప్పేముంది? ఆ లెక్కన ప్రధాని మోదీ కూడా బ్రాహ్మణుడే. రాముడు క్షత్రియుడు. కృష్ణుడు ఓబీసీ" అని ఆయన వ్యాఖ్యానించారు.