తిరుపతి, ఏప్రిల్ 30: తిరుపతిలో నిర్వహిస్తున్న ధర్మపోరాట సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కృష్ణుడిగా, నారదుడిగా, విశ్వామిత్రుడిగా రకరకాల వేషధారణలో తెలుగువారి ఆవేదనను తెలియజేసేందుకు ప్రయత్నించానని.. అయినా పట్టించుకోలేదని విమర్శించారు. అజాతశత్రువు లాంటి చంద్రబాబు నాయుడు అలిగితే దేశమంతా ఒక్కటవుతుందని హెచ్చరించారు. తెలుగు ప్రజలను తక్కువ చేయొద్దని అన్నారు. ఎన్టీఆర్ని పదవి నుంచి దించేస్తే ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలన్నారు. వింటే ఉంటావు మోదీ.. వినకుంటే పోతావు మూడి అంటూ తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసిరారు.