సీఎం సభ ఆలస్యమయ్యే అవకాశం

SMTV Desk 2018-04-30 16:39:24   Nara lokesh, Chandrababu, Tirupathi, dharma poratam sabha

తిరుపతి, ఏప్రిల్ 30: వాతావరణంలో అనూహ్య మార్పులతో తిరుపతిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు చెల్లాచెదరు అయ్యాయి. దీంతో తారకరామ స్టేడియంలో ‘నమ్మకద్రోహం - కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం’ పేరిట తెదేపా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు విచ్చేసిన కార్యకర్తలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సభ ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి తిరుపతికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తిరుమల దర్శనానికి వెళ్లారు. శ్రీవారిని దర్శించుకుని నేరుగా సభాప్రాంగణానికి ఆయన చేరుకోనున్నారు.