మెల్బోర్న్, ఏప్రిల్ 30 : టీమిండియా క్రికెట్ జట్టు ఈ సంవత్సరం చాలా బీజీ షెడ్యూల్ గడపనుంది. ప్రస్తుతం ఐపీఎల్ అనంతరం భారత్ జట్టు వన్డే, టీ20, టెస్టు సిరీస్లు ఆడేందుకు జులైలో ఇంగ్లాండ్ వెళ్లనుంది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 2018-19కి సంబంధించి ఆసీస్ ఆడే క్రికెట్ మ్యాచ్ల వివరాలను తెలిపింది. 2018 నవంబరు 21 నుండి 2019 జనవరి 18 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య టీ20, టెస్టు, వన్డే సిరీస్లు జరగనున్నట్లు వెల్లడించింది. ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య ఆసీస్తో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మూడు సిరీస్ల్లో కంగారు ఆటగాళ్లు స్మిత్, వార్నర్ ఆడలేరు. బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా వీరిద్దరిపై విధించిన 12 నెలల నిషేధం 2019 మార్చిలో ముగియనుంది. ఇదే వివాదంలో 9 నెలల నిషేధం ఎదుర్కొంటున్న బాన్క్రాఫ్ట్ భారత్తో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనున్నాడు. షెడ్యూల్: టీ-20 సిరీస్.. మొదటి టీ20: నవంబరు 21- గబ్బా రెండో టీ20: నవంబరు 23- మెల్బోర్న్ మూడో టీ20: నవంబరు 25- సిడ్నీ టెస్ట్ సిరీస్.. మొదటి టెస్టు: డిసెంబరు 6 - ఆడిలైట్ రెండో టెస్టు: డిసెంబరు 14 - పెర్త్ మూడో టెస్టు: డిసెంబరు 26 - మెల్బోర్న్(బాక్సింగ్ డే టెస్టు) నాలుగో టెస్టు: జనవరి 3- సిడ్నీ వన్డే సిరీస్.. మొదటి వన్డే: జనవరి 12- సిడ్నీ రెండో వన్డే: జనవరి 15- ఆడిలైట్ మూడో వన్డే: జనవరి 18- మెల్బోర్న్