చెన్నై, ఏప్రిల్ 29: దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని అంటోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... చెన్నైలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అధినేత కరుణానిధితో సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన.. తన ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబును కూడా కలుస్తానని చెప్పారు. చంద్రబాబును కలుస్తారా అని విలేఖరి ప్రశ్నించగా.. కచ్చితంగా కలుస్తానని.. దానిలో సందేహం అక్కర్లేదన్నారు. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. చాలా కాలం కలిసి పనిచేశామన్నారు. అన్ని విషయాలపై చర్చిస్తానని అన్నారు.