చెన్నై, ఏప్రిల్ 29: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలోని కొందరు ముఖ్య రాజకీయ నేతలతో చర్చించిన కేసీఆర్.. ఈ రోజు చెన్నైలో పర్యటిస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కలిసి కాసేపు చర్చించిన కేసీఆర్.. ప్రస్తుతం డీఎంకే వర్కింగ్ ప్రెసిండెట్ స్టాలిన్తో భేటీ అయ్యారు. కేసీఆర్ వెంట తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావుతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు కేకే, వినోద్ కూడా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం మరికొంత మందితో చర్చించి, రాత్రికి చెన్నైలోనే బస చేసి, రేపు మధ్యాహ్నం చెన్నై నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.