నేడు చెన్నై వెళ్లనున్న కేసీఆర్‌

SMTV Desk 2018-04-29 12:17:15   telangana Cm Kc rKarunanidhi Chennai

హైదరాబాద్‌, ఏప్రిల్ 29: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రగతి భవన్‌ నుంచి ఆదివారం ఉదయం 11.15కు బేగంపేట్‌ విమానాశ్రయానికి బయలుదేరుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45కు హోటల్‌ ఐటీసీ గ్రాండ్‌ చోళాకు చేరుకుంటారు. 1.30 సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు. 2 గంటలకు తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్‌తో భేటీ కానున్నారు. అనంతరం హోటల్‌ ఐటీసీ గ్రాండ్‌ చోళాకు చేరుకుంటారు. తర్వాత షెడ్యూల్‌ ప్రకారం పలు సమావేశాల్లో పాల్గొంటారు.