హైదరాబాద్, ఏప్రిల్ 28: టాలీవుడ్ కు 2010లో‘ ఏ మాయ చేసావె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ప్రస్తుతం అగ్రకథానాయకగా కొనసాగుతుంది సమంత. గతేడాది అక్కినేని వారసుడు, హీరో నాగచైతన్యను వివాహం చేసుకుని నాగార్జునకు కోడలయ్యారు. కాగా ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సామ్కు ట్విటర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ ప్రముఖులు, సమంత స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. వీరందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. సమంత తన భర్త చైతన్యతో కలిసి జమ్ము కశ్మీర్కు వెళ్లారు. పుట్టినరోజును పురస్కరించుకుని వీరు మంచు కొండల అందాలను తిలకించడానికి వెళ్లారు. ఈ విషయాన్ని సమంత స్వయంగా సోషల్మీడియా ద్వారా తెలిపారు.