రైతులతో మాజీ జేడీ లక్ష్మీ నారాయణ భేటీ

SMTV Desk 2018-04-26 17:07:29  cbi ex jd laxmi narayana, meet farmers, guntur

గుంటూరు, ఏప్రిల్ 26: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఈ రోజు గుంటూరులో పర్యటి౦ చారు. పదవీ విరమణ అన౦తరం ఆయన తొలి సామాజిక కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలోని కర్లపాలెం మండలం యాజలి గ్రామ రైతులు, వ్యవసాయ ఉత్పత్తిదారులతో ఆయన భేటీ అయి చర్చి౦చారు. అంతకు ముందు ఆయనకు రైతులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. యాజిలిలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో లక్ష్మీ నారాయణ గ్రామస్తులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలుత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాని చెప్పారు.