హైదరాబాద్, ఏప్రిల్ 26: తెలంగాణలో టెన్త్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. అయితే విడుదలపై అధికారులు స్వల్ప మార్పులు చేశారు. రేపు ఉదయం 10 గంటలకు విడుదల కావాల్సిన రిజల్ట్స్ రాత్రికి వాయిదా వేశారు. రేపు రాత్రి 7గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. సచివాలయంలోని డీ-బ్లాక్ గ్రౌండ్ ప్లోర్లో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేస్తారని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 5,38,867 మంది విద్యార్థులు హాజరు కాగా, అందులో 2,62,479 మంది బాలికలు, 2,76,388 మంది బాలురు ఉన్నారు. రేపు ఉదయం టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.