అర్ధాంతరంగా గవర్నర్‌ దిల్లీ పర్యటన రద్దు

SMTV Desk 2018-04-25 15:10:07  Governor ESL Narasimhan to leave for Delhi today

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ దిల్లీ పర్యటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి చేరుకున్న గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కావాల్సి ఉంది. ఉదయం 9.30 గంటలకు రాజ్‌నాథ్‌సింగ్‌తో.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానితో సమావేశమయ్యేందుకు ఆయన అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నారు. అయితే ఈరోజు ఉదయం తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని గవర్నర్‌ హైదరాబాద్‌ పయనమయ్యారు. అయితే దీనికి కారణాలు మాత్రం తెలియరాలేదు. .